Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రయాణిస్తున్న మహిళపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (14:46 IST)
లక్నో - ముంబైల మధ్య నడిచే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ దారుణం జరిగింది. ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దోపిడీ దొంగలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్లీప‌ర్ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై 8 మంది దోపిడీ దొంగ‌లు క‌త్తుల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించారు. దొంగ‌ల దాడిలో ఐదారు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గురై గ‌ట్టిగా అర‌వ‌డంతో రైలును ముంబైలోని కాస‌రా స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆ కోచ్ వ‌ద్ద‌కు చేరుకుని ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. 
 
ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ‌ల నుంచి రూ.34 వేల న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం