Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ లో 24 గంటల్లో 8,635 కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:44 IST)
భారత్‌ లో కరోనా మరణాలు 100 దిగువకు చేరాయి. అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దాంతో ఇప్పటి వరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి.
 
మరోవైపు రికవరీ రేటు 97శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది.

దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  

మరోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రం అత్యవసర వినియోగం కింద వైరస్ ముప్పు పొంచి ఉన్నవారికి అందిస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments