Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరివుండగానే వృద్ధుడిని శవపరీక్షకు పంపిన వైద్యులు... ఎక్కడ?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (15:10 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల నిర్లక్ష్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇపుడు మరోమారు వీరి నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఫలితంగా ఓ వృద్ధుడు బతికుండగానే శవపరీక్షకు పంపించారు. 
 
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 72 యేళ్ల కాశీరామ్ అనే వృద్ధుడు అనారోగ్యం కారణంగా చేరాడు. అయితే, ఆ వృద్ధుడు వైద్య చికిత్సలకు స్పందించలేదు. దీంతో వృద్ధుడు చనిపోయాడన్న నిర్ధారణకు వచ్చిన వైద్యులు... శవపరీక్షకు పంపించారు. 
 
దీంతో పోలీసు అధికారి అనిల్ మౌర్య ఆసుపత్రిలోని పోస్టుమార్టం విభాగానికి చేరుకున్నారు. ఈ సమయంలో కాశీరామ్ శ్వాస తీసుకుంటుండటాన్ని మౌర్య గుర్తించారు. దీంతో వెంటనే కాశీరామ్‌ను తిరిగి ఆసుపత్రి వార్డులోకి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. అయితే, ఆ వృద్ధుడు చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. 
 
ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ఆర్ రోషన్ మాట్లాడుతూ ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments