Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరివుండగానే వృద్ధుడిని శవపరీక్షకు పంపిన వైద్యులు... ఎక్కడ?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (15:10 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల నిర్లక్ష్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇపుడు మరోమారు వీరి నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఫలితంగా ఓ వృద్ధుడు బతికుండగానే శవపరీక్షకు పంపించారు. 
 
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 72 యేళ్ల కాశీరామ్ అనే వృద్ధుడు అనారోగ్యం కారణంగా చేరాడు. అయితే, ఆ వృద్ధుడు వైద్య చికిత్సలకు స్పందించలేదు. దీంతో వృద్ధుడు చనిపోయాడన్న నిర్ధారణకు వచ్చిన వైద్యులు... శవపరీక్షకు పంపించారు. 
 
దీంతో పోలీసు అధికారి అనిల్ మౌర్య ఆసుపత్రిలోని పోస్టుమార్టం విభాగానికి చేరుకున్నారు. ఈ సమయంలో కాశీరామ్ శ్వాస తీసుకుంటుండటాన్ని మౌర్య గుర్తించారు. దీంతో వెంటనే కాశీరామ్‌ను తిరిగి ఆసుపత్రి వార్డులోకి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. అయితే, ఆ వృద్ధుడు చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. 
 
ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ఆర్ రోషన్ మాట్లాడుతూ ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments