Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వయస్సులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (13:21 IST)
70 ఏళ్ల వయస్సులో తొలిసారిగా మగబిడ్డకు జన్మనిచ్చారు.. రాజస్థాన్ మహిళ. దీంతో తల్లిదండ్రులు కావాలన్న తమ కలను పెళ్లైన 54 ఏళ్ల తర్వాత నెరవేర్చుకుంది ఆ జంట.
 
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన చంద్రావతి-గోపీ సింగ్ అనే జంటకు పెళ్లై 54 ఏళ్లైనా సంతానం లేదు. ప్రస్తుతం గోపీ సింగ్ వయసు 75 కాగా, చంద్రావతి వయసు 70. వీరిద్దరూ సంతానం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో ఆల్వార్ జిల్లాలో ఉన్న ఒక ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్‌ ద్వారా ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించారు. మూడోసారి ఆ ట్రీట్మెంట్ విజయవంతమైంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఐవీఎఫ్ విధానంలో చంద్రావతి గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ ఆమె వయసు ఎక్కువ కావడం వల్ల సంతానం విషయంలో వైద్యులు కొంత సందేహించారు. అయితే, ఏ ఇబ్బందీ లేకుండా గత సోమవారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. బిడ్డ దాదాపు మూడున్నర కేజీల బరువున్నట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments