Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు ఓకే అంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా: 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల యువతి ప్రపోజల్

మీరు ఓకే అంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా: 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల యువతి ప్రపోజల్
, శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:33 IST)
సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓచోట కొందరు సైబర్ మోసానికి బలవుతున్నారు. తాజాగా హైదరాబాదు, జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఓ యువతి చేతిలో మోసపోయాడు.

 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తను రెండో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా అతడు మ్యాట్రిమోని సైటులో ప్రొఫైల్ పెట్టాడు. మరుసటి రోజు అతడికి 25 ఏళ్ల వయసున్న అమ్మాయి ఫేస్ బుక్ ఖాతా అన్నట్లు డిపి నుంచి రిక్వెస్ట్ వచ్చింది.

 
నాకు 25 ఏళ్లు, మీకు 50 ఏళ్లు. ఐనా ఫర్వాలేదు... మీ సిచ్యువేషన్ తెలుసుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. అంగీకరిస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ వచ్చింది. దీనికి ఆ వ్యక్తి ఓకే అనేసాడు. ఆ తర్వాత... సదరు యువతి తనకు కోవిడ్ వచ్చిందనీ, ఇంజినీరింగ్ చదువుతున్నాననీ, తనకు ఆర్థిక సాయం చేయమంటూ అతడి నుంచి రూ. 46 లక్షలు కొట్టేసింది. ఆ తర్వాత ఫోనుకి సరైన రెస్పాన్స్ లేకోపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు బాధితుడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ ఘటన.. ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్