Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్ ఆరగించి ఆస్పత్రి పాలైన 70 మంది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:37 IST)
ఒడిశా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఐస్‌క్రీమ్ ఆరగించిన 70 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యాపారి బండి ఐస్ క్రీమ్ విక్రయించాడు. దీన్ని పిల్లలు పెద్దలు కొనుగోలు చేసి ఆరగించారు. సరిగ్గా రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయానికి ఐస్ క్రీమ్ తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. 
 
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందులుపడ్డారు. దీంతో వారందరినీ అప్పటికపుడు దమన్ జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్‌పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 60 మంది కోలుకోగా, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments