Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్ ఆరగించి ఆస్పత్రి పాలైన 70 మంది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:37 IST)
ఒడిశా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఐస్‌క్రీమ్ ఆరగించిన 70 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యాపారి బండి ఐస్ క్రీమ్ విక్రయించాడు. దీన్ని పిల్లలు పెద్దలు కొనుగోలు చేసి ఆరగించారు. సరిగ్గా రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయానికి ఐస్ క్రీమ్ తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. 
 
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందులుపడ్డారు. దీంతో వారందరినీ అప్పటికపుడు దమన్ జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్‌పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 60 మంది కోలుకోగా, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments