Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ పేలి ఒకే ఫ్యామిలీలో ఏడుగురు కూలీలు మృతి

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:40 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో రాష్ట్రంలోని ఓ విషాదకర ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వలస కూలీలు మృతి చెందారు. వీరందరినీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్​ వచ్చిన కూలీలు స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. 
 
అయితే శుక్రవారం రాత్రి ఇంట్లోని గ్యాస్ స్టౌ పేలడంతో ఈ ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments