Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (10:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించడంతో అందులోని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ఘోరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృత్తుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments