Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్.. ఏడుగురు చిన్నారుల మృతి

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (14:17 IST)
అడెనో వైరస్ కారణంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
తాజాగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదైనాయి.  
 
ఏడుగురు చిన్నారుల్లో కోల్‌కతాలోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
 
రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై సీఎం మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.
 
అడెనోవైరస్ సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments