మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.. దంపతుల కారును ఆపి..?

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (13:41 IST)
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ నడిరోడ్డుపైనే వీరంగం సృష్టించాడు. దంపతుల కారును ఆపి నానా హంగామా సృష్టించాడు.
 
కారులో వస్తున్న దంపతులను ఆపి అసభ్యకరమైన పదజాలాలతో దూషిస్తూ.. మహిళ అని చూడకుండా ఆమెపై చిందులు వేశాడు. 
 
ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్టేషన్ పరిధిలోని కొత్వాల్ గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
 
కానిస్టేబుల్ తీరుతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిర్రెత్తుకొచ్చిన దంపతులు వెంటనే డయల్ 100కి ఫోన్ చేశారు. 
 
దీంతో వారిపై చిందులు తొక్కిన కానిస్టేబుల్ మద్యం మత్తులోనే తన కారును నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments