డీఎంకే కార్యకర్త దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Webdunia
శనివారం, 14 మే 2022 (19:22 IST)
తమిళనాడులో డీఎంకే కార్యకర్త హత్యకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నై రాయపురంలోని గ్రేస్ గార్డెన్ మూడో వీధిలోని ఓ ఇంట్లో గోనె సంచిలో డీఎంకే కార్యకర్త చక్రపాణి (65) మృతదేహం కనిపించింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టగా ఓ గోనె సంచిలో మనాలికి చెందిన చక్రపాణి మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు అస్లాం హుస్సేనీ బట్చా (35), అతని భార్య ఎ. తమీమ్ బాను (40)కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 
నాలుగు రోజుల క్రితమే చక్రపాణిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం చక్రపాణి... తమీమ్‌తో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఆ జంట రాయపురానికి వెళ్లిన తర్వాత కూడా అది కొనసాగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో చక్రపాణిని హత్య చేశారని తెలిపారు. అస్లాం హుస్సేనీ సోదరుడు ఎం.వసీం బట్చా కూడా నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నారని చెప్పారు.
 
తమీమ్ మంగళవారం ఉదయం తన ఇంటికి రమ్మని మెసెజ్ చేయగా చక్రపాణి వెళ్లారని అదే సమయంలో తన స్నేహితుడు కె.డిల్లీ బాబుతో కలిసి ఇంటికి వెళ్లిన వసీం... తమీమ్, చక్రపాణీలను చూసి గొడవ పడి.. చక్రపాణిని హత్య చేసినట్టు తాము అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
 
ఈ క్రమంలో వసీం, ఢిల్లీ బాబు పరారీలో ఉండగా.. అస్లాం హుస్సేనీ, తమీమ్ బానులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ జీహెచ్‌కి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments