అంజలి మృతి కేసులో సందేహాలెన్నో.. ఎన్నెన్నో...

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (16:27 IST)
ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి (20) అనే యువతి కారు ప్రమాదంలో చనిపోయింది. ఈ యువతి చనిపోయి రోజులు గడిచిపోతున్నప్పటికీ.. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటివరకు వెల్లడింలేకపోతున్నారు. దీనికి కారణం.. కారు నడిపిన ఐదుగురు నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడు ఉన్నట్టు సమాచారం. అందుకే పోలీసులు కూడా మృతికి కారణాలు వెల్లడించకుండా నాన్చుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
 
డిసెంబరు 31వ తేదీ రాత్రి తన స్నేహితులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్న అంజలి.. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో నిధి అనే స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. 
 
ఆ స్కూటీని మార్గమద్యంలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో నిధి ఎగిరిపడగా, అంజలి మాత్రం కారు కింద ఇరుక్కుని పోయింది. అయినా కారును ఆపకుండా ఐదుగురు నిందితులు పరారయ్యారు. ఆఖరుకి 12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అంజలి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వారు పారిపోయారు. 
 
ఈ అమానవీయ ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుకున్నాయి. కానీ 60 గంటలు గడిచిపోయినా సమాధానాలు మాత్రం కొన్ని ప్రశ్నలకే లభించింది. కొత్త సంవత్సర వేళ ఒక కారు 12 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని ఈడ్చుకెళుతుంటే దారిలో ఒక్కరంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరా? ఒక వేళ పోలీసులు ఉంటే మహిళను ఢీకొట్టిన నిందితులు ఎలా తప్పించుకోగలిగారు అనే సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments