Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్.. ధర రూ.6,499 మాత్రమే..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:37 IST)
షావోమీకి చెందిన సబ్ బ్రాడ్ పోకో కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోను ధరను కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. అత్యాధునిక ఫీచర్లతో పోకో కంపెనీ ఈ స్మార్ట్ ఫోనును తయారు చేసింది. పోకో సీ50 పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోనును రెండు వేరియంట్లలో రూపొందించారు. 2జీబీ వేరియంట్ ధర రూ.6,499గా నిర్ణయించగా, 3జీబీ వేరియంట్ ధర రూ.7,299గా ఖరారు చేశారు. అయితే, ప్రారంభ ఆఫర్ ధరగా రూ.6,249, రూ.6,999గా లభించనుంది. 
 
ప్రస్తుత దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోనులో 6.5 అంగుళాల హెచ్.డి.ప్లస్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 12గో ఎడిషన్‌, ఫింగర్ ఫ్రింట్ స్కానర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, లెదర్ లైక్ టెక్సర్ డిజైన్‌తో లభించనుంది. 
 
వెనుకభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జ్‌తో ఉంటుంది. ఫ్లిప్ కార్టులో ఈ నెల 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు. రాయల్ బ్లూ, కంట్రీ బ్లూ రంగుల్లో ఈ ఫోను లభించనుంది. అయితే, ఇది బేసిక్ ఫోన్. గేమింగ్‌కు ప్రత్యేకమైన అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments