Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:42 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 11 యేళ్ల మైనర్ బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖుంతి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితులు 10 నుంచి 15 యేళ్ల లోపువారు కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం‍ సందర్భంగా తనకు ఇంతకుముందే తెలిసిన నిందితులతో వాగ్వివాదం జరిగింది. 
 
ఈ పెళ్లి తర్వాత మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్థరాత్రి వేళ స్వగ్రామానికి బయలుదేరింది. ఆ యువతిని అనుసరించిన మైనర్లు కొంతదూరం వచ్చాక అడ్డగించి, ఆ తర్వాత ఎవరూలేని ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్నేహితురాళ్లు జరిగిన విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న బాధిత యువతి తల్లిదండ్రులను చూడగానే వారు పారిపోయారు. 
 
అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు తొలుత బాధిత యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని వెనుకంజ వేశారు. అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతి తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments