Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తుల దుర్మరణం

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కొంతమంది భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు దుర్మణం పాలయ్యారు. ఈ ఘోరం శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలికి చెందిన కొందరు భక్తులు ట్రాక్టర్‌లో జైసల్మేర్‌లో రామ్ దేవ్రాకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ట్రాక్టర్ సుమేర్ పూర్ వద్ద వస్తుండగా ఎదురుగా అమిత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపది ధన్‌కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments