Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఘోర ప్రమాదం- ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు మృతి

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (10:53 IST)
MBBS students
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళ్తున్న కారు అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
 
సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. 
 
ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. ముగ్గురు స్టూడెంట్లు అక్కడికక్కడే చనిపోయారు.
 
బస్సు ప్రయాణికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments