Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం- ఏపీ వాసులు మృతి

road accident

సెల్వి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (11:25 IST)
అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. 
 
అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు ప్ర‌వాస భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. 
 
మృతుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగు వారు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు. ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు కాగా.. ఒకరు గూడురుకు చెందినవారున్నారు. మృతులు గోపి తిరుమూరు, రజినేని చిరంజీవి శివ, హరితారెడ్డి డేగపూడిగా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బస్సు నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు, ప్రాణం పోతున్నా 40 మందిని రక్షించాడు