Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను విషాదం మిగిల్చిన భారీ వర్షం : ఐదుగురి మృతి

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:23 IST)
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఘ‌జియాబాద్ ప‌ట్ట‌ణంలో భారీ వర్షం పెను విషాదం మిగిల్చింది. ఇక్కడ కురిసిన భారీ వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వ‌ర్షం కార‌ణంగా విద్యుత్ షాక్ త‌గిలి ఐదుగురు వ్య‌క్తులు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మ‌హిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘ‌జియాబాద్‌లోని సిహానీగేట్ పోలీస్ స్టేష‌న్ ఏరియా రాకేష్ మార్గ్‌లోని తేన్ సింగ్ ప్యాలెస్ స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఓ కిరాణాషాపు య‌జ‌మాని ఎండ త‌గుల‌కుండా త‌న షాపు ముందు రేకుల క‌ప్పు ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా క‌రెంటు తీగ కొంచెం జారి రేకుల‌కు అనుకుంది. 
 
ఆ రేకులకు ఆనుకుని ఒక ఇనుప టెలిఫోన్ స్తంభం ఉంది. బుధ‌వారం ఉద‌యం ఇద్ద‌రు చిన్నారులు ఆ దుకాణంలో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులిద్ద‌రూ ఇనుప స్తంభాన్ని ట‌చ్ చేయ‌డంతో షాక్ త‌గిలి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.
 
ప‌క్క‌నే ఉన్న మ‌రో ముగ్గురు వారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారు కూడా విద్యుత్ షాక్‌తో స్పృహ కోల్పోయారు. వెంట‌నే ఆ ముగ్గురిని ఆస్ప‌త్రికి త‌రలించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మృతులు జాన‌కి (35), ఆమె కూతురు సుభి (3), ల‌క్ష్మీశంక‌ర్ (24), ఖుషి (10), సిమ్రాన్ (11)గా గుర్తించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments