Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల్లో వరుస భూకంపాలు..

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:22 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వివరాల మేరకు.. అసోంలోని తిన్‌సుకియా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదయింది. పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 7.07 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. 
 
సిలిగురికి తూర్పున 64 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమయింది. దీని తీవ్రత 4.1 గా నమోదయింది. సిక్కిం-నేపాల్‌ సరిహద్దు సహా అసోం, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో గత సోమవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. 
 
12 గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ఆయా రాష్ట్రాల విపత్తు శాఖలు అప్రమత్తమయ్యాయి. తాజాగా సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడి అధికారులతో సమీక్షించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments