Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:41 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఓ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తాను మనసుపడిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు స్వయంగా తన చేతిరాతతో ప్రేమలేఖ రాశారు. దీనిపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పైగా, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి గురువుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
ఇంతకీ ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడి వయసు 47 యేళ్లు. బాలిక వయసు 13 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెల 30వ తేదీన ఓ బాలికకు కొత్త సంవత్సర గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. 
 
ఆ తర్వాత దాన్ని ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థిని కూడా అలానే చేసింది. ఆ విద్యార్థిని ఆ లేఖను చదివిన తర్వాత నేరుగా తన తల్లిదండ్రులకు విషయం చెప్పిందే. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments