Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:41 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఓ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తాను మనసుపడిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు స్వయంగా తన చేతిరాతతో ప్రేమలేఖ రాశారు. దీనిపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పైగా, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి గురువుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
ఇంతకీ ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడి వయసు 47 యేళ్లు. బాలిక వయసు 13 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెల 30వ తేదీన ఓ బాలికకు కొత్త సంవత్సర గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. 
 
ఆ తర్వాత దాన్ని ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థిని కూడా అలానే చేసింది. ఆ విద్యార్థిని ఆ లేఖను చదివిన తర్వాత నేరుగా తన తల్లిదండ్రులకు విషయం చెప్పిందే. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments