Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేర చరితులే..

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (08:55 IST)
ఇటీవల గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారాన్ని దక్కించుకుంది. తద్వారా వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్ శాసనసభలో ఒక్క బీజేపీ మాత్రమే ఏకంగా 156 సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 చోట్ల విజయం సాధించారు.
 
అయితే, కొత్త అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుల్లో ఏకంగా 40 మంది నేరచరితులే కావడం గమనార్హం. వీరిలో 20 మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. బీజేపీ తరపున ఎన్నికైన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 9 మంది, ఐదుగురు ఆప్ శాసనసభ్యుల్లో ఇద్దరిపై ఈ తరహా తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 
 
ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. నేరచరిత్ర కలిగిన 40 మందిలో 29 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉండగా, కొందరిపై అత్యాచారం, హత్య కేసు కూడా ఉండటం గమనార్హం. అయితే, గత 2017లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇపుడు కొంతమేరకు తగ్గింది. గతంలో 47 మంది నేరచరితులు అసెంబ్లీకి ఎన్నికకాగా, ఇపుడు ఈ సంఖ్య 40కి తగ్గినట్టు ఏడీఆర్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments