Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పేలుళ్లలో జేడీఎస్ నేతలు మృతి... మరికొందరు మిస్సింగ్

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:25 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుసబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 250 మంది వరకు చనిపోయారు. మరికొంతమంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ పేలుళ్ళలో చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. విహార యాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు ఆచూకీ తెలియకపోవడమే. 
 
ఇదే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ ట్వీట్ చేశారు. "తమ పార్టీ జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌)కు చెందిన ఏడుగురు నేతలు శ్రీలంకలో అదృశ్యమయ్యారు. ఎన్నికల ప్రచారం అనంతరం మారెగౌడ, పుట్టారాజు, శివణ్ణ, లక్ష్మీనారాయణ, హనుమంతరాయప్ప, రమేష్‌, రంగప్పలు ఈనెల 20న శ్రీలంక వెళ్లారు. బాంబు పేలుళ్లు జరిగిన కొలంబోలోని ద షాంగ్రిలా హోటల్‌లోనే వీరు బస చేసినట్టు తెలిసింది. పేలుళ్లు జరిగిన తర్వాత వీరు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఏడుగురిలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments