Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి మహిళపై కక్ష.. ఐదుగురితో సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..?

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:38 IST)
ఆఫీసులో పనిచేసే తోటి మహిళపై కక్ష తీర్చుకునేందుకు మరో మహిళ దారుణానికి పాల్పడింది. ఐదుగురు పురుషులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించింది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీయించి బెదిరించసాగింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా ఓ మహిళ చేరింది. అక్కడే పని చేస్తున్న మరో మహిళ ఆమెపై కక్ష పెంచుకుంది. 2020లో ఓ రోజు ఆమెను పని చేస్తున్న హోటల్‌లకు పిలిపించింది.
 
మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. దీంతో అది తాగిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ తతంగాన్ని వీడియో తీసింది. అది చూపించి రెండేళ్లుగా నిందితులు ఆమెను బెదిరించి, అత్యాచారం చేస్తున్నారు. చివరికి విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments