Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో కలకలం.. అర్థరాత్రి 300 మందితో పార్టీ.. బెల్లీ డ్యాన్స్‌..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:11 IST)
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పార్టీల గోల మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు సర్కారు విధించిన నిబంధనలను అధిగమించి.. 300మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని హిల్లీ జిల్లాలోని ఉదుంబంచోలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి తెలిసిందని పోలీసులు తెలిపారు. జూన్ 29 అర్థరాత్రి ఈ కార్యక్రమం జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైందని తెలిపారు. మేనేజర్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసుకు సబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
 
జూన్ 29 రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు ఈ పార్టీ జరిగిందన్నారు. ఈ పార్టీలో బెల్లీ డ్యాన్స్ వంటివి చోటుచేసుకున్నాయని, ఇందులో డ్యాన్స్ చేసిన డ్యాన్సర్‌ను పక్క  రాష్ట్రం నుంచి రప్పించినట్లు తెలిసింది. మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పార్టీకి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం