Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలో కరోనా ఉగ్రరూపం : 2021 మార్చికి 21 కోట్ల కరోనా కేసులు

Advertiesment
Covid 19
, బుధవారం, 8 జులై 2020 (15:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇందులోభాగంగా, గడచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 264కి పెరిగింది. కొత్తగా 1062 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 22,259కి చేరింది. 
 
11,101 మంది డిశ్చార్జి కాగా, 10,894 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 173, తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షల మందికిపైగా చనిపోయారు. మన దేశం విషయానికి వస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.50 లక్షలను సమీపిస్తోంది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత మన దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో కరోనా కేసులపై అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ద్వారా పలు విషయాలు వెలుగుచూశాయి. 2021 మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని తేలింది. 
 
18 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతారని వెల్లడైంది. ఇదేసమయంలో ఇండియాలో ఊహించని విధంగా కేసులు నమోదవుతాయని... రోజుకు 2.8 లక్షల వరకు కేసులు వస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ సర్కారుకు నిరాశ