Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారం ద్వారా బంగారం స్మగ్లింగ్... ఎలా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:06 IST)
బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులోభాగంగా, ముగ్గురు వ్యక్తులు 1.25 కేజీల బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కారు. తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా విమానం ఒకటి వచ్చింది. ఈ విమానంలో కొందరు ప్రయాణికులు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో విమానం తిరుచ్చికి చేరుకోగానే, ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
అత్యాధునిక స్కానింగ్ పరికరాలు ఏ ఒక్కరివద్ద బంగారం ఉన్నట్టు గుర్తించలేక పోయాయి. అయితే, ముగ్గురు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని మరో గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణలో నిజం వెల్లడించారు. 
 
మలద్వారం, అరికాలికి రసాయన పదార్థాలతో అంటించి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి 1.25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులను రియాజ్ అహ్మద్, తమీమ్ అన్సారీ, జకీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments