Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారుల ప్రాణాలు తీసిన ట్రైన్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (13:26 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టాలపై కూర్చొని పండ్లు ఆరగిస్తున్న నలుగురు చిన్నారులను ఓ రైలు ఢీకొట్టింది. దీంతో ఆ నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం పంజాబ్ రాష్ట్రంలోని కిరత్‌పూర్ సాహిబ్‌‌లో జరిగింది. 
 
సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్లను తెంపుకుని ఆ పక్కనే ఉన్న పట్టాలపై కూర్చొని ఆరగిస్తున్నారు. ఆ సమయంలో  సహరాన్ పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళుతున్నది. 
 
అయితే, ఈ రైలును ఆ చిన్నారులు గమనించలేదు. వారు పట్టాలపైనే కూర్చొని పండ్లు తింటూ కూర్చొన్నారు. దీంతో వారిని రైలు ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments