Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని వదిలిపెట్టొద్దు... ప్రభుత్వం అప్పీల్ చేయాలి : సుబ్రమణ్య స్వామి

2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేయడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (13:14 IST)
2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేయడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేయాలని ఆయన కోరారు. సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. 
 
కాగా, గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌పై తొలుత పిటీషన్ దాఖలు చేసింది సుబ్రమణ్య స్వామినే. ఈయన దాఖలు చేసిన పిల్‌ ఆధారంగా 2జీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు 14 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిపై  తీవ్రంగా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి… ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటీషన్ దాఖలు చేయాలని సూచించారు. 
 
కాగా, ఈ తీర్పుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోడీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం