Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామసేతును గౌరవించాలి : బీజేపీ ఎంపీ స్వామి

రామసేతు వారధి మానవ నిర్మితమని భారతీయులందరికీ తెలుసని, అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి నిర్ధారిస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు.

రామసేతును గౌరవించాలి : బీజేపీ ఎంపీ స్వామి
, గురువారం, 14 డిశెంబరు 2017 (09:43 IST)
రామసేతు వారధి మానవ నిర్మితమని భారతీయులందరికీ తెలుసని, అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి నిర్ధారిస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కమిటీ సైతం ఇది మానవ నిర్మితమని చెప్పిందన్నారు. అందువల్ల శ్రీరాముడికి ప్రతిరూపంగా భావిస్తున్న రామసేతును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు. 
 
కాగా, భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చిన విషయం తెల్సిందే. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉంది. అయితే దీనిపై కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ వారధిని రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు.
webdunia
 
ఈ నేపథ్యంలో తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే నిర్మించారని నిర్ధారించింది. పరిశోధనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం కూడా అమెరికాలో ప్రసారమైంది. ఈ కార్యక్రమ ప్రోమోలో ఓ భూగర్భ శాస్త్రవేత్త రామసేతులో ఉన్న రాళ్లను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడి ఇసుక దిబ్బలపై అమర్చారు అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాస్ రూమ్‌లో ఇన్నర్‌వేర్‌తో పాఠాలు చెప్పిన షైమాకు రెండేళ్ల జైలు