Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎఫ్‌లో 21 మందికి కరోనా.. భారత్‌లో లాక్‌డౌన్‌తో తగ్గాయట..

Webdunia
శనివారం, 23 మే 2020 (18:02 IST)
బీఎస్ఎఫ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా శనివారం మరో 21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు బీఎస్ఎఫ్‌ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో బీఎస్ఎఫ్‌లో కొత్తగా 21 మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారు అందరినీ గుర్తింపు పొందిన కోవిడ్‌-19 హెల్త్‌కేర్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.
 
కాగా శనివారం నమోదైన 21 కేసులతో కలిపి బీఎస్‌ఎఫ్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 406కు చేరింది. అయితే, వారిలో 286 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 120 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీ భారత్‌లో కరోనా ప్రభావంపై చేసిన అద్యాయనం ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. భారత్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ వలన ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా వరకు సఫలమయ్యారని అన్నారు. లాక్‌డౌన్‌తో 60శాతం వరకూ కరోనా వ్యాప్తి తగ్గిందని తేల్చింది. కరోనా వ్యాప్తి వేగాన్ని కనిపెట్టడానికి ఆర్‌నాట్ అనే ఒక ముఖ్యమైన ప్రాతిపదిక ఆధారంగా పరిశోధన చేస్తారు. 
 
ఈ ఆర్‌నాట్ అనేది ఒక వ్యక్తి నుండి కరోనా ఎంత మందికి సోకింది అనే ఒక సంఖ్యను సూచిస్తుంది. లాక్‌డౌన్ విధించే నాటికి అంటే.. మే24 నాటికి ఈ విలువ 3.36గా ఉంది. అయితే.. తరువాత అది తగ్గుతూ ఏప్రిల్ 14 నాటికి 1.71గా.. మే 3 నాటికి ఇది 1.46కి.. చివరికి మే16 నాటికి బారీగా తగ్గి 1.27కు చేరుకుందని ఈ అధ్యాయంలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments