Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 24,712 కొత్త కరోనా కేసులు..312 మరణాలు

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:14 IST)
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. బుధవారం 10,39,645 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,712మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. జనవరి 30న తొలికేసు వెలుగుచూసిన దగ్గరి నుంచి 1,01,23,778 మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఇక క్రియాశీల కేసుల సంఖ్య 2,83,849గా ఉండగా.. ఆ రేటు 2.80 శాతానికి చేరింది. నిన్నటితో 96,93,173 (95.75శాతం) మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 312 మంది మరణించగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,46,756 మంది బలయ్యారు.

డిసెంబర్ 1 నుంచి 22వరకు వారాల వ్యవధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో చోటుచేసుకున్న మార్పును మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఉండగా.. మహారాష్ట్రలో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments