Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లింది.. దాచడం కోసం కిడ్నాప్ డ్రామా వేసింది..

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (13:37 IST)
ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. అలా ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ ముగించుకుని షికారుకు వెళ్లింది. కానీ ఆ నాగ్‌పూర్ యువతి కిడ్నాప్ డ్రామా లేటుగా వెలుగులోకి వచ్చింది.  
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ యువతి కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్‌తో షికారుకెళ్లింది. ఇంట్లో ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా భయపడి తనను నలుగురు వ్యక్తులు కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని, ఆపై వారి నుండి తప్పించుకొని వచ్చానని కిడ్నాప్ డ్రామా ఆడింది. 
 
దీంతో యువతి తల్లిదండ్రుల జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువతిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, అందులో ఆమె కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్ బైక్‌పై బయటకు వెళ్లడాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెను పోలీసులు నిలదీయగా.. తాను కట్టుకథ చెప్పినట్లు అంగీకరించిందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments