Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారథాన్ ‌‌పూర్తి చేసిన గంటకు బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 24 జులై 2023 (10:01 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. మారథాన్ పరుగును విజయవంతంగా పూర్తి చేసిన ఓ బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి.మూర్తి జెండాఊపి ఈ మారథాన్ పోటీని ప్రారంభించారు. ఇందులో కళ్ళకుర్చికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఈ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు.
 
అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్‌రూంకు వెళ్లాడు. ఆ తర్వాత అతడికి బాత్రూమ్‌లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడంతో స్నేహితులు గుర్తించి అతడిని సమీపంలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు బాధితుడికి కృత్రిమ శ్వాస, జీవనాధార వ్యవస్థపై ఉంచి చికిత్స ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయంలో దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దినేశ్ మదరైలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments