Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నదిలో పడవ ప్రమాదం - 20 మంది మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. 
 
యమునా నదిలో 50 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తా పడింది. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కవడంతో ఈ బోటు బోల్తాపడినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
సహాయక బృందాలు ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, పడవ బోల్తాపడగానే అందులోని వారంతా నదిలో మునిగిపోయారు. వీరిలో ఈత తెలిసిన వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments