Webdunia - Bharat's app for daily news and videos

Install App

మథుర బంకీ బిహారీ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (14:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నపాటి అపశృతి జరిగింది. మథురలో ఉన్న బంకీ బిహారీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఒక్కసారిగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇద్దరు భక్తుల ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడినట్టు సమాచారం. 
 
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే శనివారం 1.45 గంటల సమయంలో మంగళ హారతి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ నవనీత్ సింగ్ చాహల్ వెల్లడించారు. 
 
మృతుల్లో నోయిడాకు చెందిన 55 యేళ్ళ మహిళతో పాటు జబల్‌పూర్‌కు చెందిన 65 యేళ్ల మహిళ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆలయంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments