Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడుకు సీఎం కేసీఆర్ - ప్రజాదేవిన సభకు హాజరు

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (12:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా ఆ పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులు పైఎత్తులు వేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మునుగోడులో తెరాస ప్రజాదీవెన పేరుతో ఓ బహిరంగ సభను శనివారం నిర్వహిస్తుండగా, ఇందులో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. మొత్తం లక్షన్నర మంది కూర్చొనేలా 25 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరిస్తారు. 
 
ఈ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరనున్నారు.
 
ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్‌ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
 
ప్రజాదీవెన బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments