Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ ... 19 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:58 IST)
తమిళనాడు రాష్ట్రంలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు సమీపంలో ఉన్న అవినాసి వద్ద జరిగింది. తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంతో వచ్చిన ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. అంబులెన్స్‌లను రప్పించి, క్షతగాత్రులను తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments