Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌తో సంబంధం.. వద్దన్నందుకు తల్లిని చంపేసిన యువతి.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో య

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (16:05 IST)
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో యువతితో అఫైర్ పెట్టుకుంది. ఈ అఫైర్‌ను సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. చివరికి తల్లినే ఆ యువతి హతమార్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహిళా టీచర్‌తో సంబంధం పెట్టుకోవద్దని తల్లి హెచ్చరించడంతో 18ఏళ్ల యువతి ఈ నెల 9న 38 ఏళ్ల తల్లిని కర్ర, ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చింది. మహిళా టీచర్‌తో కలిసి వుండటానికి నిందితురాలి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తల్లిని చంపి పారిపోదామనుకుంది. ఈ ఘటనపై నిందితురాలిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని హతమార్చిన యువతిని అరెస్ట్ చేశారు. అలాగే నిందితురాలైన యువతితో సంబంధం పెట్టుకున్న టీచర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై నిందితురాలి తండ్రి మాట్లాడుతూ.. మహిళా టీచర్‌తో కలిసి జీవించేందుకు 18ఏళ్ల తన కుమార్తె (నిందితురాలు) ఇంటి నుంచి రెండు నెలల ముందే పారిపోయిందని.. మైనర్ కావడంతో ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడుతుందని తాను భావించలేదని తండ్రి వాపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments