Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 18మంది మృతి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (11:19 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 18మంది మృతి చెందగా.. 19మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బీహార్‌వాసులుగా గుర్తించారు అధికారులు. బీహార్‌కు చెందిన వలసకూలీలు హర్యానా నుంచి స్వస్థలాలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
ట్రక్కు ఢీ కొనడంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. వలస కూలీలంతా బస్సు ముందు భాగంలోనే ఉండటంతో.. వారంతా చనిపోయారు. మరికొందరు బస్సులోనుంచి రోడ్డుపై పడ్డారు. దీంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి గురైన డబుల్ డక్కర్ బస్సులో సుమారు వందకుపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా హర్యానాకు చెందిన పాల్వాల్‌, హిసర్‌ జిల్లాల నుంచి బిహార్ వస్తున్నట్టుగా తెలిపారు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్.
 
ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. ప్రయాణికులంతా బీహార్‌కు చెందిన వివిధ ప్రాంతాల వారు కాగా.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు ఎస్పీ యమునా ప్రసాద్‌. క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తీసివేశామని.. బస్సు కింద ఎవరూ లేరని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments