Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం... 17ఏళ్ల బాలికపై దుండగుల యాసిడ్ దాడి

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:39 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ పోసి పారిపోయారు. దాడిలో బాధిత బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన సమయంలో బాధిత బాలిక తన చెల్లిలితో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఉదయం 9 గంటలకు మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ కు ఈ సంఘటన గురించి కాల్ వచ్చిందని డీసీపీ మండవ తెలిపారు. బాలిక తన చెల్లెలితో ఉన్నప్పుడు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ లాంటి పదార్థాన్ని పోసి పారిపోయారు. బాలిక ద్వారకాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది.
 
యాసిడ్ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments