Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం... 17ఏళ్ల బాలికపై దుండగుల యాసిడ్ దాడి

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:39 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ పోసి పారిపోయారు. దాడిలో బాధిత బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన సమయంలో బాధిత బాలిక తన చెల్లిలితో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఉదయం 9 గంటలకు మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ కు ఈ సంఘటన గురించి కాల్ వచ్చిందని డీసీపీ మండవ తెలిపారు. బాలిక తన చెల్లెలితో ఉన్నప్పుడు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ లాంటి పదార్థాన్ని పోసి పారిపోయారు. బాలిక ద్వారకాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది.
 
యాసిడ్ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments