Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వారంలో 15 మంది పాక్ రేంజర్లను కాల్చిపారేశాం : బీఎస్ఎఫ్

యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:47 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హోరాహోరీ కాల్పుల్లో గత వారం రోజుల్లో 15 మంది పాక్‌ రేంజర్లను కాల్చిపారేసినట్టు భారత సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రకటించింది. పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు తెలిపింది. 
 
అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లోని జమ్ము, కథువా, పూంఛ్‌, రాజౌరి జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి గురువారం అర్థరాత్రి నుంచి పాక్‌ బలగాలు పెద్ద ఎత్తున కాల్పులను ప్రారంభించాయి. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం వరకు కాల్పులు కొనసాగాయి. పాక్‌ కవ్వింపు చర్యలకు భారత బలగాలు ధీటుగా జవాబిచ్చాయి. 
 
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఐదుగురు అనుమానిత లష్కరే తాయిబా ఉగ్రవాదులు సహా ఓ పోలీసును భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మరోపక్క, 'స్వాతంత్ర సమరం మరింత ముందుకు' అంటూ లష్కరే ప్రకటనలు కనిపించాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments