Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులకు సహకరించాడని.. 13ఏళ్ల బాలుడిని శూలాలకు గుచ్చి చంపేశారు..

ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (11:12 IST)
ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరికి చెందిన అరుణ్‌కుమార్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. అతని ఇంటిపక్కనే ఉన్న బంధువు కలైసెల్వి (18).. అదే గ్రామానికి చెందిన అరుళ్‌ (23)తో ప్రేమలో పడింది. వారిద్దరికీ అరుణ్‌ ‘మాట సాయం’ చేస్తున్నట్లు కలైసెల్వి బంధువులకు అనుమానం వచ్చింది. 
 
ఈ విషయం తెలియరావడంతో మంగళవారం సాయంత్రం నుంచి అరుణ్‌కుమార్‌ కనిపించకుండాపోయాడని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వీరమంజేరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మణి ఆండవర్‌ ఆలయ త్రిశూలాలకు అరుణ్‌కుమార్‌ శవం వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన దర్యాప్తులో అతన్ని తానే చంపేశానని కలైసెల్వి సోదరుడు కదివరన్‌ అంగీకరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments