Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. మగబిడ్డ జననం

వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరా

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:06 IST)
వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లా కక్రపార్ అనే గ్రామానికి చెందిన 40 యేళ్ల కామాంధుడుకి భార్య, ఓ కుమార్తె ఉంది. భర్త వేధింపులు భరించలేని భార్య... తన కుమార్తెతో కలిసి కటర్గామ్ అనే ప్రాంతంలో నివశిస్తోంది. ఈ భార్యాభర్తలు గత ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
అయితే, పాఠశాల సెలవు రోజుల్లో తండ్రిని చూసేందుకు 12 యేళ్ల బాలిక కక్రపార్ గ్రామానికి వెళ్లివచ్చేది. ఈ క్రమంలో కన్నబిడ్డపై కన్నేసిన కామాంధుడు... అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీయగా జరిగిన వాస్తవాన్ని వెల్లడించింది. 
 
దీంతో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కామాంధ తండ్రిని అరెస్టు చేశారు. కాగా, ఆ బాలిక వద్ద జరిపిన పోలీసు విచారణలో గతంలోనే 28 యేళ్ల తన మేనమాన అత్యాచారం చేశాడని వెల్లడించింది. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments