Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ వంతెన కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (13:11 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై ఉన్న పురాతన కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 140 దాటిపోయింది. ఈ మృతుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్‌‍కోట్ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ కుటుంబ సభ్యులు 12 మంది ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా మోహన్ భాయ్ సోదరి తరపున బంధువులుగా గుర్తించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కేబుల్ వంతెనపై సుమారుగా 500 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో వంతెన తెగిపోవడంతో వారంతా మచ్చూ నదిలో పడ్డారు. వీరిలో ఈత తెలిసినవారు ఈదుకుంటూ గట్టుకు చేరుకోగా మరో 170 మంది సహాయక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య 141కు చేరింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమైవున్నాయి.
 
మరోవైపు, ఒకేసారి 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్టు తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన బోరున విలపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోందన్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments