Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం .. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు...

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:44 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి జరిగింది. 
 
ఓ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో నిలబడివున్నారు. వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు నియంత్రణ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంపై బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments