Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న తెలంగాణ - పడిపోయిన ఉష్ణోగ్రతలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీల నుంచి ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. 
 
ఆదివారం తెల్లవారుజామున కుమరం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఈ సీజనులో ఇంత తక్కువ మోతాదులో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో మున్ముందు మరింత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments