Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 11 వేల కొత్త కేసులు.. 13 వేల రికవరీలు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:24 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 8,70,058 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,451 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ముందురోజు కంటే 5.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. అలాగే నిన్న 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,61,057 మంది మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. క్రియాశీల రేటు గతేడాది మార్చి నాటి కనిష్ఠానికి చేరగా.. రికవరీ రేటు అప్పటి గరిష్ఠానికి చేరింది.

ప్రస్తుతం 1,42,826 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 0.42 శాతానికి చేరింది. నిన్న 13,204 మంది కోలుకోగా.. మొత్తంగా 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.
 
పండగల సీజన్, ప్రభుత్వ సెలవులు కారణంగా గత నెల నుంచి టీకా కార్యక్రమం నెమ్మదించింది. నిన్న 23,84,096 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 108 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments