Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి అనుమానాస్ప‌ద మృతి... ఆ ఇద్ద‌రు యువ‌కులూ...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:05 IST)
ఒక లేడీ కానిస్టేబుల్‌కు కూడా వేధింపులు త‌ప్ప‌లేదు. ఇద్ద‌రు యువ‌కుల నిర్వాకంతోనే ఆమె మృతి చెందిందని గ్రామ‌స్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత నెల‌కొంది.
 
 
మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు, సోమ‌వ‌రం గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
 
జిల్లేపల్లి ప్రశాంతిని హత్య చేసి, వారే పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి వ‌చ్చార‌ని సోమవరం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆమె బంధువులు,  గ్రామస్తులు ఆ యువకులు ఇద్దరిని గృహ నిర్బంధం చేశారు. దీనితో పోలీసులు వ‌చ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ఎఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి మృతిపై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments