Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో విషాదం - విద్యుదాఘాతానికి 10 మంది కన్వర్ యాత్రికుల మృతి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:31 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురైంది. దీంతో 10 మంది కన్వర్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కులో జల్పేష్ వెళుతుండగా కూచ్ బెహార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనికి జనరేటర్ వైర్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
గాయపడిన వారిలో 16 మందిని మెరుగైన వైద్య సేవల కోసం జల్పాయ్‌గురి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కులో డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగిందని మఠభంగ అడిషినల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. కన్వర్ భక్తులంతా సీతల్‌కుచి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నారని అమిత వర్మ వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments