Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. పదిమంది మృతి

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (08:53 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొనడంతో.. బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
  
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ – ఔరంగాబాద్ రహదారిపై నందూర్నాక వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఈ ఘటనను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే ధృవీకరించారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments